ఒళ్లు దగర్గ పెట్టుకుని మాట్లాడాలి.. ఏలేటికి పొన్నం మాస్ వార్నింగ్

బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలుతోందన్న బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మాస్ వార్నింగ్‌ ఇచ్చారు

  • Publish Date - March 30, 2024 / 04:38 AM IST

బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలుతోందన్న బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మాస్ వార్నింగ్‌ ఇచ్చారు

విధాత : బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలుతోందన్న బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మాస్ వార్నింగ్‌ ఇచ్చారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీని టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 48గంటల్లో పడగొడుతామంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారి మూర్ఖత్వాన్ని చాటుతున్నాయన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండని ఛాలెంజ్ చేశారు. మాది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని.. దేనికైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మా ప్రభుత్వాన్ని కులగొడతామంటున్నారు.. మీరు ఏమైనా జ్యోతిష్యం చెప్పారా..? అని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ బలహీన వర్గాల ముఖ్యమంత్రి అని చెప్పిందని, ఉన్న బీసీ అధ్యక్షుడిని తీసేశారని ఎద్దేవా చేశారు. 23 సంవత్సరాల చరిత్రలో బలహీన వర్గాలకు ఒక్క పదవి ఇచ్చిన పరిస్థితి లేదని విమర్శించారు. మా పార్టీ తప్పు చేస్తే మేమే ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీపీపై గెలిచిన వ్యక్తినని.. కలలో కూడా బీజేపీ ఉసెత్తనని తేల్చి చెప్పారు. బీజేపీకి చేతనైతే 10 సంవత్సరాల్లో దేశ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని మోడీ అవమానించారని గుర్తు చేశారు. తెలంగాణ విభజన హామీలు నెరవేర్చారా అని ప్రశ్నించారు.

Latest News