విధాత, హైదరాబాద్ : సీతారామ ప్రాజెక్టులోని పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ట్రయల్ రన్కు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి స్విచ్ ఆన్ చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులు ఈ కార్యక్రమానికి హాజరై గోదావరి తల్లికి పూజలు చేశారు. మూడు మోటార్ల గుండా గోదావరి సాగు జలాలు ఎగిసి పారాయి. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలో పారుతుంటే ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఈ ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందని, సీతారామ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఎంత ఖర్చైనా ఈ ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. సీతారామ ప్రాజెక్టు కింద 10లక్షల ఎకరాలకు సాగునీరందనుందని తెలిపారు. ఈ పథకం వైరా ప్రాంత రైతులకు వరమన్నారు. వైరా రిజయర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఆయకట్టు వరకు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. వైరా కేంద్రంగా ఈ నెల 15న జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టుకు చెందిన మూడు పంప్హౌజ్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
Sitarama project | సీతారామ ప్రాజెక్టు పంప్హౌజ్ ట్రయల్ రన్ విజయవంతం.. స్వీచ్ ఆన్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
