విధాత:హైదరాబాద్ ఫార్మాసిటీకి భూములు అందించిన కుటుంబాల వారికి ఫార్మా సిటీలో ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఉద్యోగాలకు కావాల్సిన నైపుణాన్ని సాధించేందుకు ఉద్దేశించిన రెండు నెలల శిక్షణ కార్యక్రమం సోమవారం ఫార్మాసిటీలో ప్రారంభమైంది. తొలి బ్యాచ్లో 120 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ సంద ర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జయేశ్ రంజన్ మాట్లాడారు. టీఎస్ ఐఐసీ, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ట్రైనింగ్ మాడ్యూల్స్, ప్రొడక్షన్ ఆపరే టర్, ల్యాబ్ టెక్నీషియన్, మాన్యుఫ్యా క్చరింగ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలకు రెండు నెలల శిక్షణ ఇస్తున్నామన్నారు. కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి అవ కాశాలూ కల్పిస్తామని తెలిపారు.