DGP Jitender | నగర శాంతిభద్రతలకు ప్రభుత్వం ప్రాధాన్యత: డీజీపీ జితేందర్

హైదరాబాద్ నగర ప్రజల భద్రత, రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డేటా సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'హ్యాకథాన్-2024' కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు

DGP Jitender | నగర శాంతిభద్రతలకు ప్రభుత్వం ప్రాధాన్యత: డీజీపీ జితేందర్

సైబర్ క్రేమ్ కేసుల చేధనలో పురోగతి

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రజల భద్రత, రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డేటా సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘హ్యాకథాన్-2024’ కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “ప్రస్తుతం డిజిటల్ సైబర్ సెక్యూరిటీ ప్రధానమైనదిగా మారిందని, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైనప్పటి నుంచి చాలా కేసులను ఛేదించామని, సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలకు తిరిగి నగదు చెల్లింపులు చేశామని తెలిపారు.

గత ఏడాదిలో సైబర్ క్రైమ్ వల్ల డబ్బు కోల్పోయిన బాధితులకు రూ.150 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా తిరిగి అందజేశామని తెలిపారు. ఈ హ్యాకథాన్‌లో దేశ విదేశాల నుంచి సుమారు 10వేల మంది పాల్గొనడం హర్షనీయమని, భవిష్యత్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని డీజీపీ చెప్పారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేక నిఘా పెట్టామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. నగరానికి అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరంలోని బంగ్లాదేశీయులపై నిఘా ఉంచామని.. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు చేపడతామన్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుదుకు తెలంగాణ పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.