ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం మరో మలుపు తిరిగింది. కూల్చివేత పనులు జరిపించిన జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడేను జీహెచ్ఎంసీ ఇంచార్జి కమిషనర్ అమ్రాపాలిమిషనర్ బదిలీ చేశారు
జోనల్ కమిషనర్పై బదిలీ వేటు
విధాత, హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం మరో మలుపు తిరిగింది. కూల్చివేత పనులు జరిపించిన జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడేను జీహెచ్ఎంసీ ఇంచార్జి కమిషనర్ అమ్రాపాలి బదిలీ చేశారు. వెంటనే జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు కూల్చివేతలు చేపట్టారని హేమంత్ పై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ లోటస్పాండ్లోని జగన్ ఇంటి ముందున్న రహదారిపై ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, తరచూ ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయనే కారణంతో శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇదంతా పక్కనే నివాసం ఉండే మంత్రి ఆదేశాలతోనే జరిగిందని కథనాలు వెలువడినప్పటికి, ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి సమాచారం లేకుండా మంత్రి మాట పట్టుకుని కూల్చివేతలకు పాల్పడినందుకు హేమంత్ వేటుకు గురయ్యారని సమాచారం.