రాష్ట్రం లో అధికార మార్పిడి జరిగినా పోలీసుల శాఖ లో మార్పు కనిపించడం లేదు. కొందరు పోలీసు అధికారుల తీరుతో ఆ శాఖ కు చెడ్డపేరు వస్తోంది. ప్రభుత్వం మారినా మేమెందుకు మారాలి మేమింతే అంటూ పోలీస్ స్టేషన్ల ను అక్రమాలకు అడ్డాలుగా మార్చుతున్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో పని చేసిన కొందరు పోలీసు అధికారులు ఎమ్మెల్యే ల అండ తో చేయని దందాలు లేవు
అధికార మార్పు జరిగినా ఇంకా తీరు మార్చుకోని పోలీసులు
ఎమ్మెల్యే ల అండదండలతో రెచ్చిపోతున్న ఎస్ఐ లు
గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో పోలీసుల అరాచకాలు చెప్పలేనన్ని
కాంగ్రెస్ ప్రభుత్వం లో పునరావృతం అవుతున్న పోలీసుల వ్యవహారం
తప్పు చేసినా పోలీసులను వెనకేసుకొస్తున్న నేతలు
బెదిరింపులు, సెటిల్మెంట్ల కోసమే పోలీస్ స్టేషన్ లు ….!
నారాయణ పేట జిల్లా లో పోలీసుల నిర్లక్ష్యం తో వ్యక్తి ని దారుణంగా కొట్టి చంపిన దయాదులు
పోలీస్ శాఖ ప్రక్షాళన కాకుంటే వారి పని తీరు లో మార్పు గగనమే
……………………………………
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………..
రాష్ట్రం లో అధికార మార్పిడి జరిగినా పోలీసుల శాఖ లో మార్పు కనిపించడం లేదు. కొందరు పోలీసు అధికారుల తీరుతో ఆ శాఖ కు చెడ్డపేరు వస్తోంది. ప్రభుత్వం మారినా మేమెందుకు మారాలి మేమింతే అంటూ పోలీస్ స్టేషన్ల ను అక్రమాలకు అడ్డాలుగా మార్చుతున్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో పని చేసిన కొందరు పోలీసు అధికారులు ఎమ్మెల్యే ల అండ తో చేయని దందాలు లేవు. బెదిరింపులు, భూ కబ్జా లు, అక్రమంగా కేసు లు పెట్టి బాధితులను భయబ్రాంతులకు గురించేయడం లో కొందరు ఎస్ఐ లు ఆరితేరారు.కొందరు జర్నలిస్ట్ లు ఎమ్మెల్యే లకు వ్యతిరేకం గా వార్తలు రాస్తే అలాంటి వారిపై కేసు లు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలు కోకొల్లలు. చేయని తప్పులకు ఇప్పటికీ కోర్టు ల చుట్టూ తిరుగుతున్నారు. బెదిరించి, భయపెట్టి భూ కబ్జా లు చేసి నేతల మెప్పు పొంది రూ. కోట్లు వెనుకేసుకున్న ఎస్ ఐ లు జిల్లా లో ఎందరో ఉన్నారు.ప్రధానంగా జిల్లా లో ని వాగుల్లో ఇసుక పుష్కళంగా దొరుకుతుంది. వాగు లు పరిసర ప్రాంత మండలాల ఎస్ ఐ లకు ప్రధాన ఆదాయ వనరుగా ఇసుక మారింది. ఈ మండలాలకు పోస్టింగ్ కావాలంటే రూ. నేతలకు రూ. లక్షల్లో సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఈ జిల్లా లో ఇసుక వ్యాపారం రూ. కోట్ల ల్లో ఉంటుంది. ఇక్కడ ఒక ఇసుక మాఫియా ఉంది. వీరు చెప్పినట్లు అందరూ నడుచుకోవాలి.
వీరికి అండగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే లు ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మాఫియా, పోలీసుల అండతో నేతలు ఇసుక దందా నడిపిస్తారు. ఈ ఇసుక దందా చేసి మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయం లో ఓ అటెండర్ రూ. కోట్లకు పడగలేత్తారని ఇటీవల కలెక్టర్ వరకు ఫిర్యాదు వెళ్ళింది. వాగు పరిసర ప్రాంత ఎస్ ఐ లు కూడా పెద్ద మొత్తం లో సంపాదించారనే ఆరోపణలు జిల్లా లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదు లు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా పోలీసుల తీరు మారడం లేదు. ఉట్కూరు మండల ఎస్ ఐ నిర్లక్ష్యం తో నిండుప్రాణం పోయింది. పొలం వద్ద దయాదుల మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం ఎస్ ఐ కి కొందరు గ్రామస్తులు తెలిపినా ఆయన పెద్ద గా పట్టించుకోలేదు. ఈ ఘర్షణ లో ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఇది ముమ్మాటికీ ఎస్ ఐ నిర్లక్ష్యం అని ఆయన తీరు పై మండల ప్రజలు మండిపడ్డారు. పోలీసు ఉన్నత అధికారులు కూడా ఆలస్యం గా మేలుకొని ఆ ఎస్ ఐ ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన కొందరు ఎస్ ఐ లు విధుల పట్ల అలసత్వవం వహిస్తూ పోలీస్ శాఖ కు మచ్చ తెస్తున్నారు. ఇటీవల గద్వాల జిల్లా లోని అయిజ మండల ఎస్ ఐ సివిల్ తాగాదాల్లో తల దూరుస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేశారు. ఈ విషయం పై గద్వాల కు చెందిన న్యాయవాది ఎస్ ఐ ఆగడాలను అడ్డుకున్నారు. న్యాయవాది అని చూడకుండా ఇష్టానుసారంగా దుర్భాశలాడారు. దీంతో ఆగ్రహం చెందిన న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించే వరకు వచ్చారు. ఎస్ ఐ పై జిల్లా న్యాయమూర్తులకు, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా జిల్లా లో పోలీసుల తీరు చెప్పుకుంటూ పోతే చాంతాడు అంతా అవుతుంది. పోలీసుల అరాచకాలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయినా అడ్డుకట్ట వేస్తుందా లేదా మాజీ సీఎం కెసిఆర్ లా చూసి చూడనట్లు ఉంటారా అనే సందేహం జిల్లా ప్రజల్లో వ్యక్తం అవుతోంది.