విధాత, హైదరాబాద్ : మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం చేపటిట్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటుచేసుకుంది. చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడ్డ నిజమాబాద్ వాసి గొల్ల రాజన్న(60) సొమ్మసిల్లి పడిపోయాడు. పోలీసులు అతడిని వెంటనే కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కాగా చేప మందు ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్, యూపీ, చత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. వేలాదిమందితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. ఆస్తమా బాధితులు పెద్దఎత్తున చేప ప్రసాదం కోసం వచ్చారు. క్యూలైన్లో ఉన్నవారికి నాలుగైదు గంటలు నిరీక్షించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు.
చేప మందు పంపిణీలో విషాదం … భారీ తరలొచ్చిన జనం
మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం చేపటిట్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటుచేసుకుంది. చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడ్డ నిజమాబాద్ వాసి గొల్ల రాజన్న(60) సొమ్మసిల్లి పడిపోయాడు

Latest News
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు