పోడు భూముల వివాదం విధాత : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయాపాలెం అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో తలెత్తిన గొడవ నేపథ్యంలో గిరిజనులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోడు భూములకు సంబంధించి రెండు గిరిజన వర్గాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే క్రమంలో పోలీసుల వైఖరి గిరిజనులను ఆగ్రహావేశాలకు గురి చేసింది. మహిళలపై పోలీసు అధికారి చేయిచేసుకున్నారని ఆరోపిస్తూ మూకుమ్మడిగా పోలీసులపై దాడి చేశారు. పారిపోతున్న పోలీస్ అధికారిని పట్టుకుని మరి కొట్టగా, మిగతా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కూడా కొట్టారు. కర్రలతో పాటు చేతికి ఏం దొరికితే అది పట్టుకుని మరి గిరిజనులు పోలీసులపై దాడి చేసిన వీడియాలు వైరల్గా మారాయి.