Women should lead the society: Collector Kranti విధాత: మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది సమాజాన్ని ముందుకు నడిపించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి(Collector Kranti) అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా లో శుక్రవారం హరిత హోటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సృజన(SP Srujana)తో కలిసి మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. బాల్య వివాహాలు అరికట్టాలి: కలెక్టర్ క్రాంతి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు వారి […]
Women should lead the society: Collector Kranti
విధాత: మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది సమాజాన్ని ముందుకు నడిపించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి(Collector Kranti) అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా లో శుక్రవారం హరిత హోటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సృజన(SP Srujana)తో కలిసి మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళినప్పుడే సమాజం ఇంకా అభివృద్ధి చెందుతున్నారు. బాల్యవివాహాలు అరికట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరికిపై ఉందని కలెక్టర్అన్నారు. గ్రామాలలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు తల్లిదండ్రులను ఒప్పించి బాల్య వివాహాలు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేస్తే వారికి పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. ఆడపిల్లల చదువుపట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి ఇంటిలో తల్లిదండ్రులు ఆడ మగ తేడా లేకుండా ఇద్దరిని ఒకేలా చూడాలని ఆన్నారు. ఒక కుటుంబంలో మహిళ అక్షరాస్యురాలు అయితే ఆ కుటుంబం బాగుపడుతుందని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు మహిళా సాధికారత కోసం కృషి చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ సృజన మాట్లాడుతూ సమాజంలో అందరితో కలిసిపోయే ఉద్యోగస్తులు యూనిఫామ్ లేని పోలీసుల లాంటివారని, ప్రతి మహిళా ఉద్యోగి సమాజాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. మహిళలలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకు వస్తే వాటి పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేస్తుందని ఆమె తెలిపారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న నానుడి పోవాలంటే ప్రతి మహిళ సాటి మహిళను అర్థం చేసుకొని కలిసి పోవాలన్నారు. మహిళలంటే చిన్న చూపు ఉండకుండా మన ఇంటిలోనే తల్లిదండ్రులు ఆడ మగ పిల్లలను సమానంగా చూడాలని అన్నారు. కుమారుడికి ఇచ్చిన ప్రాధాన్యత కూతురుకు కూడా ప్రతి తల్లిదండ్రులు ఇవ్వాలని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని ఎస్పీ తెలిపారు.
అనంతరం వివిధ రంగాలలో సేవలందించిన మహిళా ఉద్యోగులకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో జడ్పి సీఈవో విజయా నాయక్, డి డబ్ల్యు ఓ ముషాహిదా బేగం, డిఆర్డిఏ ఉమాదేవి, మార్కెట్ యార్డ్ పుష్పమ్మ, ఎస్సీ మరియు బిసి అభివృద్ధి అధికారి శ్వేతా ప్రియదర్శిని, అంగన్వాడి టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఏపిఎంలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.