విధాత, హైదరాబాద్ : హుజురాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీస్ కేసు నమోదైన క్రమంలో అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కూడా పోలీసు కేసులు నమోదవ్వడం హాట్ టాపిక్గా మారింది. కుమ్రంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఇరువర్గాల ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. ఈ వివాదంలో విశ్వప్రసాద్ రావు చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై పోలీసులు 296(బీ), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆరెస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఏకపక్షంగా కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు.నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని కేటీఆర్ తెలిపారు.
అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కేసు నమోదు .. ఖండించిన కేటీఆర్
హుజురాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీస్ కేసు నమోదైన క్రమంలో అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కూడా పోలీసు కేసులు నమోదవ్వడం హాట్ టాపిక్గా మారింది

Latest News
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
పూరీ బీచ్ లో నవనీత చోరుడు బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పం !
నాపై వేటుకు మల్లు రవినే కారణం : చిన్నారెడ్డి ఫైర్
దమ్ముంటే రాజీనామా చేయ్.. కొండాకు బస్వరాజు సారయ్య సవాల్
త్వరలో బిగ్ అప్డేట్ : కొండా సురేఖ
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ