విధాత, హైదరాబాద్ : హుజురాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీస్ కేసు నమోదైన క్రమంలో అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కూడా పోలీసు కేసులు నమోదవ్వడం హాట్ టాపిక్గా మారింది. కుమ్రంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఇరువర్గాల ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. ఈ వివాదంలో విశ్వప్రసాద్ రావు చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై పోలీసులు 296(బీ), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆరెస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఏకపక్షంగా కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు.నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని కేటీఆర్ తెలిపారు.
అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కేసు నమోదు .. ఖండించిన కేటీఆర్
హుజురాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీస్ కేసు నమోదైన క్రమంలో అసిఫాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కూడా పోలీసు కేసులు నమోదవ్వడం హాట్ టాపిక్గా మారింది

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు