విధాత:ఇది అలాంటిలాటి సాదా సీదా నౌక కాదు. అత్యంత శక్తిమంతమైనది. భారత గూడచారి నౌక ఇది. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లతోపాటూ… అణ్వస్త్ర క్షిపణుల్ని (Nuclear Missiles) ఈ నౌక భారత భూభాగంపై పడకముందే గుర్తించగలదు. ఎంత వేగంగా గుర్తిస్తుందంటే సెకన్లలో గుర్తిస్తుంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలదు. ఇలాంటి నౌకను భారత్ తయారుచేస్తుందని తెలిస్తే… పక్క దేశాలైన చైనా, పాకిస్తాన్ భరించలేవు. అడ్డుకుంటాయి. అందుకే ఇండియా రహస్యంగా దీన్ని తయారుచేసింది. స్వయంగా ప్రధానమంత్రి […]
విధాత:ఇది అలాంటిలాటి సాదా సీదా నౌక కాదు. అత్యంత శక్తిమంతమైనది. భారత గూడచారి నౌక ఇది. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లతోపాటూ… అణ్వస్త్ర క్షిపణుల్ని (Nuclear Missiles) ఈ నౌక భారత భూభాగంపై పడకముందే గుర్తించగలదు. ఎంత వేగంగా గుర్తిస్తుందంటే సెకన్లలో గుర్తిస్తుంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలదు. ఇలాంటి నౌకను భారత్ తయారుచేస్తుందని తెలిస్తే… పక్క దేశాలైన చైనా, పాకిస్తాన్ భరించలేవు. అడ్డుకుంటాయి. అందుకే ఇండియా రహస్యంగా దీన్ని తయారుచేసింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో దీన్ని నిర్మించారు. సెప్టెంబర్ 10 దీన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా దీని వివరాల్ని బయటపెట్టారు. ఆ తర్వాత ఇది విశాఖపట్నం నుంచి పని ప్రారంభిస్తుంది. శాటిలైట్లతో కనెక్ట్ అయ్యి… భూమి మొత్తాన్నీ గమనిస్తూ ఉంటుంది.
ఈ నౌకను విశాఖలోని హిందుస్థాన్ షిప్యార్డ్లో తయారుచేశారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (NTRO) దగ్గరుండి దీన్ని చక్కగా తయారుచేయించాయి. ఈ నౌకకు మరో ప్రత్యేకత ఉంది. ఇది సముద్ర జలాలపై ఓ కన్నేసి ఉంచుతుంది. ఏదైనా శత్రుదేశం జలాంతర్గామి (Submarine)… భారత్ వైపు సముద్రం నుంచి వస్తూ ఉంటే ముందే కనిపెట్టి చెప్పేస్తుంది. ఇలాంటి నౌకలు ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన చేరింది. ఈ నౌకను భారత నౌకాదళం ఉపయోగిస్తుంది. ఇందులో వ్యూహాత్మక దళ కమాండ్ (SFC) కూడా కలిసి పనిచేస్తుంది. ఇది మొత్తం 10 టన్నుల బరువున్న నౌక. భవిష్యత్తులో శత్రుదేశాల నుంచి క్షిపణులు బయల్దేరితే… వెంటనే ఈ నౌక… కుయ్ కుయ్ కుయ్ కుయ్ మని శబ్దం చేస్తూ… నౌకా దళాన్ని అలర్ట్ చేస్తుంది.
వెంటనే మ్యాప్లో ఎటు నుంచి ఏ క్షిపణులు వస్తున్నాయో, వాటి వేగం ఎంత ఎక్కడ పడనున్నాయి… అన్ని వివరాలూ ఇస్తుంది. ముఖ్యంగా ఉగ్రవాదులు బలపడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి నౌక భారత్కు అత్యవసరం. పక్కనున్న పాకిస్థాన్, చైనా తోడు దొంగలు కాబట్టి… ఇండియాకు ఇది రక్షణ కవచంలా ఉంటుంది. ఆ రెండు దేశాల దగ్గరా న్యూక్లియర్ బాలిస్టిక్ మిస్సైళ్లు ఉన్నాయి. కాబట్టి ఇండియాకు ఇది చాలా అవసరం.