విధాత: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పేరిట శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి నకిలీ టిక్కెట్లు జారీ చేసి మోసం చేశారంటూ బాధితులు సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు వెంకటాద్రిపేటకు చెందిన నరేంద్ర ఒక బ్యాంక్లో పని చేస్తున్నారు. విజయవాడకు చెందిన అజయ్ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి బంధువును తిరుమలలో శ్రీవారి దర్శనానికి టిక్కెట్లు కావాలని అడిగితే అతను గుంటూరులోని నల్లపాడుకు చెందిన ఒక వ్యక్తి సెల్ నంబర్ ఇచ్చాడు.