మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెంటచింతల పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు
విధాత : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెంటచింతల పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింంగ్ సందర్భంగా ఈ నెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా.. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు అడ్డుకున్నారు. అయితే ఈ సందర్భంగా పిన్నెల్లి తనపై దాడి చేసినట్లు నంబూరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద పిన్నెల్లిపై కేసు నమోదు చేశామని రెంటచింతల పోలీసులు తెలిపారు.