దళితుల మీద దాడి
గత శనివారం నాడు, అనగా 24/04/2021 తేదీన… BC కులానికి చెందిన బోయ లింగమయ్య మరియు అతని కుమారులు ముగ్గురు సురేశ్, వెంకటేష్, శ్రీనివాసులు, నలుగురు కలసి… బి.లక్ష్మీదేవి W/O బి.మస్తానయ్య (లేట్) పై… దారుణంగా రాళ్లు, కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగినది.. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకి పోలీసులు ఆసుపత్రికి వచ్చి బాదిత మహిళతో స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది…

గత శనివారం నాడు, అనగా 24/04/2021 తేదీన… BC కులానికి చెందిన బోయ లింగమయ్య మరియు అతని కుమారులు ముగ్గురు సురేశ్, వెంకటేష్, శ్రీనివాసులు, నలుగురు కలసి… బి.లక్ష్మీదేవి W/O బి.మస్తానయ్య (లేట్) పై… దారుణంగా రాళ్లు, కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగినది..

గ్రామం లోని ఎస్సీ కాలనీ లో నివాసం ఉండే లక్ష్మీదేవి ఇంటి వద్ద గల ప్రభుత్వ భూమి లో.. లింగమయ్య కుటుంబం దొడ్డి ఏర్పాటు చేసుకుని.. వారి దొడ్డికి దారి, వేరొక చోటు నుండి ఉన్నా కుడా... కేవలం లక్ష్మీదేవి కుటుంబం మీద కుల అహంకారంతో, దౌర్జన్యంగా లక్ష్మీదేవి ఇంటి పక్కనే దారి ఏర్పాటు చేసుకుని దౌర్జన్యంగా.. తిరగడంతో లింగమయ్యను అతని కుమారులను, ఎన్నోసార్లు హెచ్చరించినా వినకుండా.. కావాలనే గొడవపడి మొండిగా దారి ఏర్పాటు చేసి తిరుగుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండేవారు...
ఇదే క్రమంలో గత శనివారం నాడు అనగా.. 24/04/2021 తేదీన... సుమారు 10గంటల సమయం లో.... బోయ లింగమయ్య మరియు అతని కుమారులు ముగ్గురు కలిసి, " మా దొడ్డికి దారి ఉంది, మేము సిమెంటు రోడ్డు వేపించాలి, మీ ఇటుకలని,కట్టెలని, తీసేయండి"" అని బెదిరించడం జరిగింది.వారితో మాట్లాడుతుండగానే... లక్ష్మీదేవి ఇంటి వద్దకు JCB తీసుకుని వెళ్లి, వారి స్థలం లో ఉన్న సిమెంట్ ఇటుకలని, ఎండు కట్టెలని, మరియు సైజు రాళ్లుని జెసీబి తో.. పెకిలించి,, లక్ష్మీదేవి ఇంటి గోడ ని పగులగొట్టడానికి ప్రయత్నం చేయడంతో... అడ్డు చెప్పబోయిన " లక్ష్మీదేవిని... బోయ లింగమయ్య, అతని కుమారులు,, సురేష్, వెంకటేష్, శ్రీనివాసు కలిసి... పెద్ద పెద్ద బండ రాళ్ల తొ, కట్టెలతో దాడి చేస్తూ... కింద పడేసి, కాళ్లతో తన్నుకుంటూ " మాదిగదాన,, మాకే అడ్డు వస్తావా...? నీ ఇల్లు పడేస్తాం...! నీకొడుకులని కుడా చంపేస్తామ్...! నువ్వు ఈ వూర్లో ఎలా బతుకుతావొ... చూస్తాం... ! " అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ... గ్రామం లోని వారందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ... లక్ష్మీదేవి కొడుకుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయబోగా... ఆమె తన కొడుకులని పిలిచుకొని.. అక్కడి నుండి వెళ్లి గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రి కి చికిత్స కోసం వెళ్లడం జరిగింది.....

అదే రోజు సాయంత్రం 4:30 గంటలకి పోలీసులు ఆసుపత్రికి వచ్చి బాదిత మహిళతో స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది…
SC/ST అట్రాసిటి కేసు నమోదు చేయాలి అని బాదిత మహిళ తరపు బందువులు కోరడంతో... DSP సార్ గారు బాదిత మహిళ అయిన లక్ష్మీదేవి ని, ఆమె కుమారులని ఇద్దరిని DSP Office కి పిలిపించుకొని విచారించి, వారి వద్ద వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగినది...