విధాత: ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఇటీవల రాజమహేంద్రవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదుకు పోలీసులు స్పందించడం లేదని జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం, పోసానిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోసాని కృష్ణమురళిపై ఐపీసీ 354, 355, 500,504, 506, 5007, 5009 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.