విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి జగన్

- క్షతగాత్రులకు పరామర్శ
విధాత : కంటాకపల్లి రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం పరామార్శించారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15మంది చనిపోగా, మరో 50మందికి పైగా తీవ్ర గాయలపాలయ్యారు.
సీఎం పర్యటన వల్ల ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేయడంతో నేరుగా విజయనగరం వెళ్లనున్న సీఎం.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 30, 2023
విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం జగన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరుపునా అందించాల్సిన తక్షణ సహయంతో పాటు ఎక్స్గ్రేషియా మొత్తాలను వెంటనే చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.