రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారిపై ఉక్కుపాదం :డిజిపి గౌతం సవాంగ్
మిడిసివేర్ నిల్వలు - వినియోగం, ఆక్సిజన్ నిల్వలు - వినియోగం, ఫీజుల పేరిట దోపిడీ మొదలైన పలు అంశాలపై నిరంతర నిఘా ఉంచినట్లు ఏపీ డిజిపి గౌతం సవాంగ్ చెప్పారు.జిల్లా పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోల్ మరియు మెడికల్ అండ్ హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నట్లు చెప్పారు. రెమెడిసివేర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలెండర్లు బ్లాక్ మార్కెట్లలో అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కు, 1902 కు ఫోన్ […]

మిడిసివేర్ నిల్వలు – వినియోగం, ఆక్సిజన్ నిల్వలు – వినియోగం, ఫీజుల పేరిట దోపిడీ మొదలైన పలు అంశాలపై నిరంతర నిఘా ఉంచినట్లు ఏపీ డిజిపి గౌతం సవాంగ్ చెప్పారు.
జిల్లా పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోల్ మరియు మెడికల్ అండ్ హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నట్లు చెప్పారు.
రెమెడిసివేర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలెండర్లు బ్లాక్ మార్కెట్లలో అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కు, 1902 కు ఫోన్ చేయాలని డిజిపి కోరారు.కోవిడ్ రోగుల నుండి ఆస్పత్రులు వసూలు చేస్తున్న అధిక ఫీజు లపై ఆరా తీస్తున్నామని, పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి సమాచారాన్ని డయల్ 100, 1902 ద్వారా చేరవేయాలని కోరారు.
ఆక్సిజన్ వాహనాలకు రవాణా పరమైన ఇబ్బందులు కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని, అందు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి నోడల్ అధికారులను నియమించినట్లు చెప్పారు. ఇతర శాఖలతో సమన్వయం కోసం కోవిడ్ కంట్రోల్ రూమ్ లో ఇద్దరు ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు.
ప్రజలంతా కోవిడ్ నిబంధనలను తూఛా తప్పకుండా పాటించాలని, మాస్క్ ధరించక పోతే జరిమానాలు తప్పవని డిజిపి హెచ్చరించారు. రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో కరోనా పై అవాస్తవాలు, పుకార్లను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోవిడ్ ఆసుపత్రులపై సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఇలాంంటివారిపైనా నిఘా ఉంచామన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తో వ్యవహరించాలని డీజీపీ కోరారు.