గాలి నుంచి రక్షణ కల్పించండి: లక్ష్మీనారాయణ
తనకు కర్ణాటక బీజేపీ నేత, గాలి జనార్ధన్ రెడ్డి నుండి రక్షణ కల్పించాలని విశాఖ సీపీని సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ వినతి పత్రం అందించారు.
విశాఖ సీపీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వినతి
విధాత, హైదరాబాద్ : తనకు కర్ణాటక బీజేపీ నేత, గాలి జనార్ధన్ రెడ్డి నుండి రక్షణ కల్పించాలని విశాఖ సీపీని సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ వినతి పత్రం అందించారు. తాను సీబీఐ అధికారిగా పనిచేసిన కాలంలో గాలి జనార్ధన్ రెడ్డిని గతంలో అరెస్ట్ చేయడం జరిగిందని, ఈ వ్యవహారంలో కక్ష సాధింపుతో తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతుందని, తనకు రక్షణ కల్పించాలని సీపీని కోరారు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం విశాఖ నార్ నియోజవర్గం నుంచి జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ నామినేషన్ వేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న తనను హత్య చేసే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram