దట్టమైన అడవి లో శవాన్ని రెండు కిలోమీటర్ల దూరం మోసిన పోలీసులు
దట్టమైన అడవి ప్రాంతం నుండి అనాధ శవాన్ని రెండు కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకొని గ్రామానికి తీసుకువచ్చి విధుల్లో మానవత్వం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా పోలీసులు. ఈ రోజు ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం, మర్రిపాలెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో నీ దట్టమైన అడవి ప్రాంతంలో సుమారు 50-60 మధ్య వయస్సు గల ఒక యాచకుడు చనిపోయి ఉన్నట్లు గమనించిన మర్రిపాలెం గ్రామస్తులు సదరు సమాచారాన్ని వెంటనే దోర్నాల ఎస్సై తెలియజేశారు. ఎస్ఐ వెంటనే దోర్నాల […]

దట్టమైన అడవి ప్రాంతం నుండి అనాధ శవాన్ని రెండు కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకొని గ్రామానికి తీసుకువచ్చి విధుల్లో మానవత్వం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

ఈ రోజు ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం, మర్రిపాలెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో నీ దట్టమైన అడవి ప్రాంతంలో సుమారు 50-60 మధ్య వయస్సు గల ఒక యాచకుడు చనిపోయి ఉన్నట్లు గమనించిన మర్రిపాలెం గ్రామస్తులు సదరు సమాచారాన్ని వెంటనే దోర్నాల ఎస్సై తెలియజేశారు.

ఎస్ఐ వెంటనే దోర్నాల పోలీస్ స్టేషన్ లో పనిచేసే జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయిన HC-1597 నాగరాజు గారు, HC- 1439 సురేష్ గార్లను సదరు గ్రామానికి పంపిన్నారు. వారు వెనువెంటనే మర్రిపాలెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంకు చేరుకొని అక్కడ చనిపోయి ఉన్న యాచకుడును చూసి, మానవత్వంతో వ్యవహరించి సదరు శవాన్ని హెడ్ కానిస్టేబుల్స్ మరియు స్ధానికుడు సహాయంతో ఒక కర్రకు కట్టుకొని స్వయంగా తమ భుజాల మీద 2Km మోసుకొని గ్రామానికి తీసుకొని వచ్చి, శవ గుర్తింపు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. దోర్నాల పోలీస్ స్టేషన్లో పనిచేసే సదరు హెడ్ కానిస్టేబుల్స్ చేసిన మానవత్వంతో కూడిన విధులను పోలీస్ అధికారులు మరియు ప్రజలు అభినందించారు.