Nara Lokesh | 39 ఏండ్ల త‌ర్వాత మంగ‌ళ‌గిరిలో టీడీపీ విజ‌యం.. చరిత్ర సృష్టించిన నారా లోకేశ్‌

Nara Lokesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ చ‌రిత్ర సృష్టించారు. మంగ‌ళ‌గిరి నుంచి బ‌రిలో దిగిన నారా లోకేశ్ రికార్డు విజ‌యం సాధించారు. 39 ఏండ్ల త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండాను రెప‌రెప‌లాడించాడు.

  • Publish Date - June 4, 2024 / 04:58 PM IST

Nara Lokesh | అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ చ‌రిత్ర సృష్టించారు. మంగ‌ళ‌గిరి నుంచి బ‌రిలో దిగిన నారా లోకేశ్ రికార్డు విజ‌యం సాధించారు. 39 ఏండ్ల త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండాను రెప‌రెప‌లాడించాడు. చివ‌రిసారిగా 1985లో టీడీపీ అభ్య‌ర్థి కోటేశ్వ‌ర్ రావు గెలుపొందారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కూ అక్క‌డ టీడీపీకి విజ‌యం వ‌రించ‌లేదు. ఇన్నేండ్ల రికార్డును బ‌ద్ద‌లు కొడుతూ టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ జ‌య‌కేతనం ఎగుర‌వేశారు.

మంగ‌ళ‌గిరి నుంచి వైసీపీ త‌ర‌పున లావ‌ణ్య పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే గెలిచింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నారా లోకేశ్ ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గాన్ని అంటిపెట్టుకుని ఉండ‌టం ఇప్పుడు ఆయ‌న‌కు క‌లిసొచ్చింది. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త‌ను పెంచాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అవే గెలుపున‌కు కార‌ణ‌మ‌య్యాయి.

Latest News