కరోనా కర్ఫ్యూ, వేసవి సెలవుల తర్వాత మొదటిసారిగా నేడు ఉపాధ్యాయులు బడులకు హాజరుకానున్నారు.
విధాత:ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలకు హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశించడంతో నేటి నుంచి బడిబాటపడుతున్నారు.
★ మొదటిరోజు ప్రవేశాలు, విద్యార్థుల వివరాల నమోదుతోపాటు ఆన్లైన్ తరగతులకు వాట్సప్ గ్రూపు, డిజిటల్ కంటెంట్ సిద్ధం చేసుకోవాల్సి ఉంది.
★ శుక్రవారం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు బడులకు వెళ్లనున్నారు.
★ పాఠశాలలోని పని ఆధారంగా ఎవరు ఏ రోజు బడికి రావాలనే దాన్ని ప్రధానోపాధ్యాయులు నిర్ణయిస్తారు.
★ ఉన్నత పాఠశాలల్లో 50 శాతం సిబ్బంది ప్రతిరోజు హాజరు కావాలి.
★ జులై 15 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన అడకమిక్ ప్రణాళికను రూపొందించాలి.
★ 15 నుంచి రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి వర్క్షీట్లను సరఫరా చేస్తుంది.
★ వీటిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చి ఇళ్లకు పంపించాలి.
★ ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను బడులకు పిలవరాదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.