దాడులు,అత్యాచారాలు,హత్యల పై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసిన..వంగలపూడి అనిత

ఏపీ లో మహిళల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యల పై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసిన తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విధాత:గత రెండేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయి. దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్లు, దిశా మొబైల్ వెహికల్స్, దిశా యాప్ ల ప్రచారం ఆంధ్రప్రదేశ్ ప్రజలను భ్రమలో పడేస్తున్నాయి. 19 జూన్ 2021 (శనివారం) నాడు […]

దాడులు,అత్యాచారాలు,హత్యల పై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసిన..వంగలపూడి అనిత

ఏపీ లో మహిళల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యల పై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసిన తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

విధాత:గత రెండేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయి.

  • దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్లు, దిశా మొబైల్ వెహికల్స్, దిశా యాప్ ల ప్రచారం ఆంధ్రప్రదేశ్ ప్రజలను భ్రమలో పడేస్తున్నాయి.
  • 19 జూన్ 2021 (శనివారం) నాడు కృష్ణ నది ఒడ్డున ఉన్న సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద మహిళ వేధింపులకు గురవ్వడం ఒక దురదృష్టకర సంఘటన.
  • సంఘటన జరిగిన ప్రదేశం ముఖ్యమంత్రి నివాసంకు, డిజిపి, స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూతవేటు దూరంలోనే ఉంది.
  • 22 జూన్ 2021 (మంగళవారం) దళిత మహిళ మల్లాది మరియమ్మ మధ్యాహ్నం 3 గంటలకు కొబ్బరి పొలాలకు వెళ్ళారు.
  • సాయంత్రం 6 గంటలకు ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.
  • మరియమ్మను చాలా కాలం క్రితం తన భర్త వదిపెట్టినా తన కుమార్తెకు ఒంటరిగా పెంచి వివాహం చేసింది.
    ఈ సంఘటన కృష్ణ జిల్లా, మైలావరం మండలంలోని తోలుకోడు గ్రామంలో జరిగింది.
  • ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం మహిళల రక్షణ కోసం చేస్తుంది సున్నా.
  • ప్రభుత్వం చేసినదల్లా దిశా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, దిశా మొబైల్ వెహికల్స్ పేరిట వైసీపీ రంగులు వేసుకోవడమే.
  • ఇప్పుడున్న చట్టాలను సరిగా అమలు చేస్తే మహిళా రక్షణ కు ఎటువంటి డోకా ఉండదు.
  • ఏపీ లో మహిళల పై జరుగున్న దాడుల గురించి తెలుసుకోవాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను.
  • ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న దాడులు పై విచారణ చేసేందుకు ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపండి.
  • కమిషన్ తక్షణ చర్యలు మహిళల్లో విశ్వాసాన్ని కలిగించడమే కాక, ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులను అరికట్టడంలో కూడా సహాయపడుతుంది.