విధాత,అమరావతి :ఎన్నికల హామీల్లో భాగంగానే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు.రెగ్యులేటరీ కమిషన్తో ఫీజులు నిర్ణయించాక నాలుగు విడుతల్లో ఫీజులను చెల్లిస్తున్నామని తెలిపారు. పారదర్శకత కోసం ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని.. దీని ద్వారా కళాశాలలో నాణ్యమైన విద్య అందడంతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. కళాశాలల ఖాతాలో జగనన్న విద్యాదీవెన నిధులు జమ చేయాలంటూ ఇటీవల […]
విధాత,అమరావతి :ఎన్నికల హామీల్లో భాగంగానే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు.రెగ్యులేటరీ కమిషన్తో ఫీజులు నిర్ణయించాక నాలుగు విడుతల్లో ఫీజులను చెల్లిస్తున్నామని తెలిపారు. పారదర్శకత కోసం ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని.. దీని ద్వారా కళాశాలలో నాణ్యమైన విద్య అందడంతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. కళాశాలల ఖాతాలో జగనన్న విద్యాదీవెన నిధులు జమ చేయాలంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సురేశ్, విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి సురేశ్ మీడియాతో మాట్లాడారు. విద్యాదీవెనపై పూర్తి సమాచారంతో హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని సీఎం నిర్ణయించారని.. పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని కోరతామని తెలిపారు.
ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లో చేపట్టవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆదేశాలు ఇంకా తమకు అందలేదని మంత్రి చెప్పారు. వద్యార్థుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇంటర్లో ఆన్లైన్ అడ్మిషన్ల విధానం చేపట్టిందన్నారు. ఆన్లైన్ అడ్మిషన్లతో నాణ్యమైన విద్య, ఫీజు, రిజర్వేషన్లు తదితర సదుపాయాలను విద్యార్థులు పొందుతారన్నారు. ఇంటర్, డిగ్రీ తరగతులకు ఆన్లైన్ అడ్మిషన్ల ద్వారా రిజర్వేషన్ల అమలు పరిపూర్ణంగా జరుగుతోందని చెప్పారు. విద్యార్థులు కోరుకున్న కళాశాలలో అడ్మిషన్లు పొందే సదుపాయం ఉంటుందన్నారు. గతేడాది కూడా ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టామని గుర్తుచేశారు. న్యాయస్థానానికి పూర్తి సమాచారం ఇచ్చి ఆన్లైన్ అడ్మిషన్ విధానాన్ని పునరుద్దరించాలని ప్రభుత్వం తరఫున కోరతామని సురేశ్ తెలిపారు.