విధాత : ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఈసీ నిషేధం విధించింది. జూన్ 3, 4, 5 తేదీల్లో వరుసగా మూడు రోజులు మద్యం దుకాణాలు తెరుచుకోవని తెలియడంతో మందుబాబులు షాపుల వద్ద క్యూ కట్టారు. మూడు రోజుల అవసరాల కోసం మద్యం కొనుగోలు చేసుకునేందుకు వైన్ షాప్ల వద్ద ఎగబడ్డారు. దీంతో వైన్స్ల ముందు మద్యం ప్రియుల రద్దీతో సందడి కనిపించింది. రాష్ట్రంలో తిరిగి 6వ తేదీ ఉదయం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి.