Bird Flu | మొన్నటి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణించింది. తాజాగా మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ కొత్త మహమ్మారి బర్డ్ ఫ్లూనేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బర్డ్ఫ్లూని H5N1గానూ పిలుస్తుంటారు. 2020 నుంచి బర్డ్ ఫ్లూ వేగంగా పెరుగుతోందని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీకి చెందిన బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ డయానా బెల్ పేర్కొన్నారు. 1997లో చైనా నుంచి వెలుగులోకి వచ్చిన ఈ బర్డ్ఫ్లూ తర్వాత క్రమంగా అన్ని ఖండాలకు వ్యాపించింది. పక్షులే కాకుండా ఏవియన్ కాని జాతులు సైతం బర్డ్ఫ్లూ బారినపడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రొఫెసర్ డయానా బెల్ చేసిన ఈ వ్యవహారంపై ఇటీవల పరిశోధన జరిపారు. ఈ పరిశోధన ప్రకారం.. 2020 తర్వాత క్షీరద జాతులు వైరస్ బారిన పడినట్లు 26 దేశాలు తెలిపాయి. ధృవపు ఎలుగుబంట్లు, డాల్ఫిన్లు సైతం ఈ వైరస్ బారినపడ్డాయి. గతేడాది 23 దేశాల్లో వైరస్ జాడలు కనిపించగా.. మనుషులకు సైతం బర్డ్ఫ్లూ సోకింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 882 బర్డ్ఫ్లూ కేసులు రికార్డయ్యాయి. బర్డ్ఫ్లూ వైరస్ కారణంగా మరణాల రేటు 52 శాతానికి చేరుకుంది. ఫౌల్ట్రీ ఫామ్లో ఇన్ఫెక్షన్ మనసులకు వ్యాపిస్తున్నది. బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించనప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ బర్డ్ ఫ్లూ మహమ్మారిగా ప్రకటించింది. ప్రభావిత ప్రాంతంలో హెచ్1ఎన్1 ఇన్ఫెక్షన్ వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశీయ పౌల్ట్రీల్లో ప్రదేశాలలో ఇది సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పక్షి మలం, నాసికా స్రావాలు, నోటి నుంచి.. కండ్ల నుంచి వచ్చిన స్రవాల ద్వారా మనుషులకు వ్యాప్తిస్తుంది. సరిగా ఉడకని మాంసాన్ని తినడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. బర్డ్ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా తప్పక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. వైరస్ను అర్థం చుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని ప్రొఫెసర్ డయానా బెల్ అభిప్రాయపడ్డారు. ఫౌల్ట్రీ పద్ధతుల్లో మార్పులు చేయాలన్న ఆయన.. ఇంటెన్సివ్ ఫార్మింగ్ పద్ధతులకు దూరంగా ఉండాలని సూచించారు.