Surbhi Puranik | చావు అంచుల దాకా వెళ్లి వచ్చానన్న హీరోయిన్‌ సురభి పురాణిక్‌..!

  • Publish Date - March 19, 2024 / 06:01 AM IST

Surbhi Puranik | ఢిల్లీ భామ సురభి పురాణిక్‌ తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నది. మామూలుగా విమానాలు ఎమర్జెన్సీ లాండింగ్‌ అవుతుంటాయి. తరుచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ ఫ్లయిట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యిందని.. పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించి.. సురక్షితంగా బయటపడినట్లు సురభి పురాణిక్‌ తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇన్ స్టా స్టోరీలో తనకు ఎదురైన చెప్పుకొచ్చింది. ‘ఆదివారం నేను ఫ్లయిట్‌లో ప్రయాణించాను. ఇంత వరకు నాకు ఎప్పుడూ ఎదురుకాని ఓ ఘటన జరిగింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చానన్న ఫీలింగ్ కలిగింది. విమానంలో సాంకేతిక లోపంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. విమానం మొత్తం కంట్రోల్‌ లేకుండా పోయింది. నా గుండె జారి నోట్లోకి వచ్చినంత పనైంది.

కొద్దిగంటల తర్వాత పైలెట్‌ నిర్ణయంతో మేమంతా బతికిపోయాం. విమానం సురక్షితంగా భూమిపై ల్యాండ్‌ చేశాడు. ఆ ఘటన ఊహించకుంటే భయంకరంగా ఉంది. నేను ఈ రోజు ఇలా బతికున్నందుకు నాలోని పాజిటివ్ థింకింగ్‌పై మరింత నమ్మకం ఏర్పడింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక సురభి పురాణికి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది. 2013 ఇవన్ వేరే మాదిరి తమిళ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘బీరువా’తో తెలుగులో తొలిసారి కనిపించింది. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఎటాక్‌, జెంటిల్‌మెన్‌, ఒక్క క్షణం, ఓటర్‌, శశి, భీమవరం చిత్రాల్లో నటించింది. చివరిసారిగా కన్నడ చిత్రం సకత్‌ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్‌ విశ్వంభర చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తున్నది. తాజాగా షూటింగ్ షెడ్యూల్‌లో సురభి జాయిన్ అయినట్లు సమాచారం. విశ్వంభరలో కీలక పాత్రలో నటించనున్నట్లు సురభి తెలిపింది.

Latest News