ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి:
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. అసెంబ్లీ ముందు ఉన్న కంచె కన్నా ఎక్కువ కంచెను ఏర్పాటు చేశారని అన్నారు. హన్మకొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ని సార్లు పడినా మళ్ళీ లేచి నిలబడే పార్టీ, ఉద్యమము నుండి పుట్టిన పార్టీ బీ ఆర్ ఎస్ పార్టీ అంటూ విమర్శించారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఐనా నినాదం జై తెలంగాణ భావన లేని మనిషి అంటూ ఆరోపించారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ అంటూ సోనియ గాంధీ దయతో ఇచ్చింది కాదన్నారు. మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు. ఇప్పుడు నెంబర్ ప్లేట్స్ మారుస్తున్నారు, ప్రజలకు ఇది ఒక అదనపు ఖర్చు అంటూ విమర్శించారు. తెలంగాణ తల్లిని తీసేస్తా అంటున్నారు. తెలంగాణ తల్లి ఉన్నప్పుడు, సవతి తల్లి కాడ ఉన్నారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నారు మంచిదే కానీ దానివల్ల ఆటో నడుపు కునే వాళ్ళ జీవిత లు రోడ్డు మీద పడ్డాయ్ వారి బాగుకోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇంతవరకు అంటూ ప్రశ్నించారు.బీఆర్ఎస్ ఓటమి పై గుణపాఠం తీసుకోవాలన్నారు. పార్టీ నిర్మాణం కార్యకర్తలు కేంద్రంగా కొనసాగాల్సి ఉందన్నారు.
– హామీల అమలుకు ప్రభుత్వం పై ఒత్తిడి : వినయ్ భాస్కర్
మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేసే విధంగా మనం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకరావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పేదల గురించి అలోచించచే ప్రభుత్వం కాదన్నారు. ఇకనుండి గుడిసె వాసుల జోలికి, చిరు వ్యాపారుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టి మా కార్యకర్తలను వేధిస్తున్నారని, కార్యకర్తల జోలికి వస్తే సహించేదిలేదని హెచ్చరించారు. త్వరలో ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.