టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ కెరటం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగు సినీ రంగానికి సంబంధించిన పెద్ద పెద్ద హీరోల అందరి పక్కన నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకొని టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈ మధ్య కాలంలో రకుల్కి తెలుగులో అవకాశాలే లేకుండా పోయాయి. బాలీవుడ్లోనే ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ గడుపుతుంది.
అయితే కరోనా సమయంలో నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది క్యూట్ భామ రకుల్.కరోనా సమయంలో తాము ఇద్దరం దగ్గరయ్యామని.. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపామని పేర్కొఒంది. దాదాపు మూడేళ్ల క్రితం తన ప్రేమ విషయం బయట పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి సంబంధించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. వీరిద్దరు కలిసి తరచు తిరుగుతూ కనిపిస్తున్నా కూడా పెళ్లిపై మాత్రం నోట మెదపడం లేదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని రకుల్, జాకీ భగ్నానీ భావిస్తున్నారట. గోవా వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నారట.
ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజం అయితే ఈ ఏడాది మొదటి సెలబ్రిటీ పెళ్లి రకుల్దే అవుతుంది. చూడాలి మరి రకుల్ తన పెళ్లిపై ఎప్పుడు అఫీషియల్ ప్రకటన చేస్తుందో.ఇక ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో అయలాన్, ఇండియన్ 2 సినిమాలు చేస్తోంది. జాకీ భగ్నానీ ఫాల్తు, రంగ్రేజ్, యంగీస్థాన్తో పలు సినిమాలు చేయగా, అవి పరాజయం పాలు కావడంతో ఇప్పుడు యాక్టింగ్కి దూరంగా ఉంటూ సినిమా ప్రొడక్షన్పై దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం రకుల్ పెళ్లి విషయంలో పూర్తి క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.