• Telugu News
  • /Business

Gold Rate | హైదరాబాద్‌లో రికార్డు స్థాయికి బంగారం.. తులం ఎంత పలుకుతుందంటే..?

Reported by: Vineela | వాణిజ్యం | Apr 08, 2024, 7:15 pm IST
Read Time: 3 mins
Gold Rate | హైదరాబాద్‌లో రికార్డు స్థాయికి బంగారం.. తులం ఎంత పలుకుతుందంటే..?

Gold Rate | పసిడి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే పసిడి ధరలు జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. తాజాగా కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఆదివారం పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.65,350 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.71,290 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,1600 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.65,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.71,290 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.65,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,440 వద్ద నిలకడగా ఉన్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.65,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.71,290 వద్ద స్థిరంగా ఉన్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి స్థిరంగా ఉన్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.87వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.