Gold Rate | బంగారం ధరలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో ధరలు ఆకాశమే హద్దుగా ధర పెరుగుతున్నది. తాజాగా మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరుగుతుండడంతో బులియన్ మార్కెట్లోనూ పెరుగుతున్నది. శనివారం 22 క్యారెట్ల బంగారంపై రూ.1200 పెరిగి.. తులానికి రూ.65,350కి ఎగిసింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్పై రూ.1310 పెరిగి.. తులానికి రూ.71,290కి పెరిగి సరికొత్త రికార్డును నెలకొల్పాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,1600కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.65,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.71,290కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.65,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,440కి చేరింది.
Gold Rate | మరోసారి పెరిగిన పసిడి ధర..! తులం రూ.72వేలకు చేరువలో..! ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.65,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.71,290 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి సైతం ఒకే రోజు భారీగా పెరిగింది. ఏకంగా రూ.1800 పెరిగి కిలో ధర రూ.83,500కి చేరింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.87వేలు పలుకుతున్నది. బంగారం, వెండి ధరలు హైదరాబాద్లో ఇంత రేటు పలకడం ఇదే తొలిసారి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.