gold, silver price increase| పెరిగిన బంగారం, వెండి ధరలు
పశ్చిమాసియా యుద్ద పరిణామాల క్రమంలో పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,760 పెరిగి రూ. 1,46,670 పెరిగింది. కిలో వెండి ధర రూ. 10,000పెరిగి రూ. 2,60,000 వద్ద కొనసాగుతుంది.
విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ద పరిణామాల క్రమంలో పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,760 పెరిగి రూ. 1,46,670 పెరిగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,450పెరిగి రూ. 1,34,450కి చేరింది. కిలో వెండి ధర రూ. 10,000పెరిగి రూ. 2,60,000 వద్ద కొనసాగుతుంది.
పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితుల కారణంగా తలెత్తిన ఆర్థిక, రాజకీయ పరిణామాల మధ్య స్టాక్ మార్కెట్ నష్టాలను పూడ్చుకోవడానికి పెట్టుబడిదారులు బంగారాన్ని అమ్ముకుంటున్నారు. దీంతో వరుస తగ్గుదలను నమోదు చేస్తున్న బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పైకి ఎగబాకాయి. అమెరికా బాండ్ విలువ, డాలర్ విలువ పెరిగిపోవడం కూడా బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram