SIM Card rules | సిమ్‌ కార్డు కొనుగోలు విషయంలో ఈ తప్పుచేస్తే మూడేళ్ల జైలుశిక్ష..!

SIM Card rules | సిమ్‌ కార్డులకు సంబంధించిన రూల్స్‌ మారిపోయాయి. జూన్ 26 నుంచి దేశవ్యాప్తంగా ‘టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023’ అమల్లోకి వచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లోనే ఈ చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. ఇప్పుడు దేశంలోని ఏ పౌరుడు జీవితకాలంలో 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులను కొనుగోలు చేయలేరు. ఒకవేళ పరిమితికి మించి ఎవరైనా సిమ్‌ కార్డులు వాడినట్లు తేలితే రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

  • Publish Date - June 29, 2024 / 11:01 AM IST

SIM Card rules : సిమ్‌ కార్డులకు సంబంధించిన రూల్స్‌ మారిపోయాయి. జూన్ 26 నుంచి దేశవ్యాప్తంగా ‘టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023’ అమల్లోకి వచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లోనే ఈ చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. ఇప్పుడు దేశంలోని ఏ పౌరుడు జీవితకాలంలో 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులను కొనుగోలు చేయలేరు. ఒకవేళ పరిమితికి మించి ఎవరైనా సిమ్‌ కార్డులు వాడినట్లు తేలితే రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అంతేకాదు, మరో కఠినమైన రూల్‌ కూడా ఉంది. వేరొకరి ఐడీ కార్డుతో మోసపూరితంగా సిమ్ కార్డు తీసుకుంటే 3 సంవత్సరాల జైలుశిక్ష ఉంటుంది. అదే సమయంలో రూ.50 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు. కొత్త టెలికాం చట్టం ప్రకారం అవసరమైతే ప్రభుత్వం మీ నెట్‌వర్క్‌ను నిలిపివేయవచ్చు. మీ సందేశాలను కూడా నిలిపివేయవచ్చు. అంతేకాకుండా పాత చట్టంలో అనేక మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వం అనేక అధికారాలను తనవద్దే ఉంచుకుంది.

ఉదాహరణకు.. అత్యవసర సమయంలో ప్రభుత్వం ఏదైనా టెలికమ్యూనికేషన్ సేవ లేదా నెట్‌వర్క్‌ని నియంత్రించవచ్చు. దాంతోపాటు ప్రభుత్వ అనుమతి తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీలలో టవర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ చట్టం (టెలికమ్యూనికేషన్ చట్టం 2023) గత ఏడాది డిసెంబర్‌లోనే పార్లమెంటు ఆమోదం పొందింది. ఇది దేశంలోని 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టమైన ‘ది ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం 1933’ స్థానంలో వచ్చింది.

టెలికమ్యూనికేషన్ చట్టం 2023లో అనేక మార్పులు జరిగాయి. ఇందులో ఏదైనా అత్యవసర పరిస్థితిలో అవసరమైతే ఏదైనా టెలికాం సేవ లేదా నెట్‌వర్క్, నిర్వహణను ప్రభుత్వం నియంత్రించగలుగుతుంది. ఆ తర్వాత నెట్‌వర్క్‌ను సస్పెండ్ చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. దేశ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు.

స్పామ్ కాల్స్‌ నుంచి ఉపశమనం

కొత్త టెలీ కమ్యూనికేషన్ చట్టంలో స్పామ్ కాల్స్ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని కారణంగా ఇప్పుడు టెలికాం కంపెనీలు మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రచార సందేశాన్ని పంపే ముందు వినియోగదారుల నుంచి సమ్మతి తీసుకోవాలి. ఇది కాకుండా వినియోగదారుల ఫిర్యాదులను వినడానికి టెలికాం కంపెనీలు ఆన్‌లైన్ యంత్రాంగాన్ని రూపొందించాలి. తద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

Latest News