హైదరాబాద్లో భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లి తన రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాడు. విరాట్ కోహ్లి వన్ 8 కమ్యూన్ పేరుతో హైటెక్ సిటీలోని హర్డ్ రాక్ కేఫ్ సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని ఆర్ఎంజడ్ ది లాఫ్ట్లో ఈ రెస్టారెంట్ను శుక్రవారం ప్రారంభించారు.
విధాత: హైదరాబాద్లో భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లి తన రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాడు. విరాట్ కోహ్లి వన్ 8 కమ్యూన్ పేరుతో హైటెక్ సిటీలోని హర్డ్ రాక్ కేఫ్ సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని ఆర్ఎంజడ్ ది లాఫ్ట్లో ఈ రెస్టారెంట్ను శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటికే బెంగళూరు, ముంబయి, పుణే, కోల్కత్తా, ఢిల్లీలో కోహ్లి రెస్టారెంట్ బిజినెస్ సాగుతుంది. తాజాగా హైదరాబాద్లోనూ తన రెస్టారెంట్ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. రెస్టారెంట్లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూ పెట్టారు.
హైదరాబాద్లో రెస్టారెంట్ ప్రారంభించిన విషయాన్ని కోహ్లి ఇన్స్ట్రాగ్రామ్లో వెల్లడించాడు. మేము ఇప్పటికే హైదరాబాద్ హైటెక్ సిటీ నడిబొడ్డుకు వచ్చేశాం.. నాకు వన్ 8 కమ్యూన్ అనేది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు.. ఇది హైదరాబాద్ లోని ప్రజలను ఒకే చోటకు చేర్చడం మా ముఖ్య ఉద్దేశం అని కోహ్లి పేర్కొన్నారు. అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభమైన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు రెస్టారెంట్ను సందర్శిస్తున్నారు. రెస్టారెంట్ లో ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ కిరాక్ ఉండాలి.. కింగ్.. అంటూ విరాట్ అభిమానులు నెట్టింట సూచనలు చేశారు.