విధాత:నటుడు,నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటి వరకు కమెడియన్గా, అలాగే తెరవెనుక నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్.. ఇప్పుడు హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్ర వివరాలు కూడా అధికారికంగా ప్రకటించారు. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో వెంకట్ చంద్ర దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సెప్టెంబర్ […]
విధాత:నటుడు,నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటి వరకు కమెడియన్గా, అలాగే తెరవెనుక నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్.. ఇప్పుడు హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్ర వివరాలు కూడా అధికారికంగా ప్రకటించారు. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో వెంకట్ చంద్ర దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సెప్టెంబర్ తొలివారంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది.
ఈ సినిమా గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘కోలీవుడ్లో పార్తిబన్గారు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ ఇది. ఈ చిత్రంతో ఆయనకి జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. అంతేకాదు పలు పురస్కారాలు ఈ సినిమాకు దక్కాయి. బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలుగుతారని సంప్రదించాం. ఆయన ఓకే చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. మరో విషయం ఏమిటంటే.. ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది..’’ అని చెప్పారు.