Chiranjeevi| టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నాలుగు దశాభ్దాలుగా మగుటం లేని మహారాజుగా కోట్లాది మంది అభిమానులలో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరం
Chiranjeevi| టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నాలుగు దశాభ్దాలుగా మగుటం లేని మహారాజుగా కోట్లాది మంది అభిమానులలో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినీ పరిశ్రమకి చేసిన సేవలకి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించారు . ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో గురువారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. అయితే అవార్డ్ అందుకోకముందు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూ వేదికగా ఇద్దరు పలు ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మ విభూషణ్ తీసుకున్నది మీరే… అది మాకందరికీ గర్వకారణం… మిమ్మల్ని నా తరఫున, ప్రజల తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 45 ఏళ్ల సినీ జీవితంలో పునాదిరాళ్లు వేసుకుని స్వయంకృషితో ఎదుగుతూ వస్తున్నారని కొనియాడారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన మీకు ఈరోజున కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అందిస్తుండడం ప్రతి తెలుగు బిడ్డ గర్వించదగ్గ అంశం అని భావిస్తున్నానని కిషన్ రెడ్డి వివరించారు.
కిషన్ రెడ్డి మాటలకి చిరంజీవి వినమ్రంగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. “పద్మ విభూషణ్ వచ్చిన ఈ సందర్భంలో నన్ను అభినందించడానికి నా స్నేహితుడిగా, చిరకాల మిత్రుడిగా మీరు రావడం చాలా సంతోషం కలిగించింది. మీ ప్రేమను, అభిమానాన్ని ఆస్వాదిస్తున్నాను” అంటూ చిరంజీవి పేర్కొన్నారు.ఇక తాను ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే మారుమూలన ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు నాకు ఇంత హోదా రావడ, ప్రపంచంలో ఎక్కడ మనవాళ్లు ఉంటే అక్కడ నాకు గుర్తింపు రావడం కానీ ఇండస్ట్రీ నాకు పెట్టిన భిక్షగానే భావిస్తాను అని చిరంజీవి అన్నారుఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా అండగా ఉంటాడో అలా నేను చిత్ర పరిశ్రమ కోసం నిలబడాలని కోరుకుంటాను కానీ, ప్రతిదానికీ పెద్దను నేను అనే రీతిలో భేషజాలకు పోను అని తెలియజేశారు. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు. రాజకీయాల్లోకి వస్తే ఇంత చేయొచ్చా అని సుస్పష్టంగా, అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది అప్పుడే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో నేను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ కలినరీ ఇన్ స్టిట్యూట్ ను ముందుకు తీసుకెళ్లింది.
నాడు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు సభలోకి అడుగుపెట్టగానే.. ఒకవైపున మీరు (కిషన్ రెడ్డి), మరోవైపున జయప్రకాశ్ నారాయణ, ఇటు చంద్రబాబు, అటు వైఎస్సార్ వంటి ఉద్ధండులు ఉండేవారు. అయితే అసెంబ్లీలో ఒకరినొకరు తిట్టుకోవడం చూశాను. అంత తీవ్రంగా దూషించుకున్నాక ఒకరితో ఒకరు ఇంకెప్పుడూ మాట్లాడుకోరు అనిపించేది. కానీ సభ బయట పరిణామాలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. అసెంబ్లీలో ఎవరైతే తిట్టుకున్నారో, బయట వాళ్లిద్దరే మాట్లాడుకుంటూ కనిపించేవాళ్లు. నువ్వేంది భయ్యా అంత మాట అన్నావు అని ఒకరంటే… నువ్వు అనలేదా అని మరొకరు… మా నాయకుడు చూస్తున్నాడు కాబట్టి అలా అనాల్సి వచ్చింది భయ్యా… అంటూ వారు మాట్లాడుకునే మాటలు నాకు షాక్ కలిగించేవి అంటూ చిరు చెప్పుకొచ్చారు.