Sai Pallavi | హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ మూవీతో సినీ ప్రియులందరినీ తనదైన నటన, అందంతో అందరినీ ఫిదా చేసింది. ఆ తర్వాత పలు విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నది. అవకాశాలు భారీగానే వస్తున్న వాటన్నింటిని పక్కనబెట్టి.. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ తనకండూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నది. ఇక సాయి పల్లవి నటనే కాదు డ్యాన్స్కు సైతం ప్రత్యేకంగా అభిమానులున్నారు.
Sai Pallavi | హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ మూవీతో సినీ ప్రియులందరినీ తనదైన నటన, అందంతో అందరినీ ఫిదా చేసింది. ఆ తర్వాత పలు విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నది. అవకాశాలు భారీగానే వస్తున్న వాటన్నింటిని పక్కనబెట్టి.. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ తనకండూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నది. ఇక సాయి పల్లవి నటనే కాదు డ్యాన్స్కు సైతం ప్రత్యేకంగా అభిమానులున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తున్నది. అయితే, ఈ న్యాచురల్ బ్యూటీ ఓ పట్టాన సినిమాలకు ఒకే చెప్పదని.. కథ నచ్చి.. పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప సినిమాలో నటించేందుకు అంగీకరించదనే టాక్ ఉన్నది.
తెలుగులో హీరోలతో సమానంగా సాయి పల్లవికి సైతం ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో తనకు నచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నది. వాస్తవానికి హద్దులు దాటే గ్లామర్ షోకు సాయి పల్లవి దూరంగా వస్తూ ఉంది. ఇదే సాయి పల్లవికి ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చింది. అయితే, విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో ఫస్ట్ సాయి పల్లవినే హీరోయిన్గా తీసుకోవాలని భావించారట. ఈ సినిమా ఆఫర్ను సాయి పల్లవి తిరస్కరించింది. అలాగే, శివ నిర్వానా డైరెక్షన్లో వచ్చిన ‘ఖుషి’ సినిమాలోనూ సాయిపల్లవినే హీరోయిన్గా తీసుకునేందుకు ప్రయత్నించారని.. ఆ చిత్రంలో క్యారెక్టర్ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసింది.
ఈ రెండు చిత్రాలు విజయ్ దేవరకొండవే కావడం గమనార్హం. అయితే, విజయ్ దేవరకొండ సినిమాలు అంటేనే కాంట్రవర్సీలనే పేరుతుంది. అదే సమయంలో విజయ్ సినిమాల్లో ఎక్కువగా బోల్డ్ సిన్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఈ ఆఫర్స్ను తిరస్కరించినట్లుగా భావిస్తున్నారు. సాయి పల్లవి చివరిసారిగా తెలుగులో విరాట పర్వం చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో ‘తండేల్’ చిత్రంతో నాగచైతన్యతో మరోసారి జతకట్టబోతున్నది. తమిళంలో అమరన్ చిత్రంలోనూ నటిస్తున్నది. ‘ఏక్ దిన్’ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. అమీర్ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణం’ చిత్రం తెరకెక్కబోతున్నది. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్ నటించనుంగా.. సీత పాత్రకు సాయి పల్లవిని తీసుకున్నట్లు తెలుస్తున్నది.