Mahesh Babu| ఇటీవల చాలా మంది స్టార్ హీరోలు థియేటర్ బిజినెస్లోకి అడుగుపెడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముందుగా మల్టీప్లెక్స్ బిజినెస్లోకి మహేష్ బాబు అడుగుపెట్టాడు. ఆ తర్వాతే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి వారు ఈ రంగంలోకి వస్తున్నారు. ప్రస్తుతం మ
Mahesh Babu| ఇటీవల చాలా మంది స్టార్ హీరోలు థియేటర్ బిజినెస్లోకి అడుగుపెడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముందుగా మల్టీప్లెక్స్ బిజినెస్లోకి మహేష్ బాబు అడుగుపెట్టాడు. ఆ తర్వాతే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి వారు ఈ రంగంలోకి వస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మల్టీ ప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ గచ్చిబౌలిలో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అక్కడకి పలువురు స్టార్స్ కూడా వచ్చి సందడి చేస్తున్నారు. అయితే ఏఎంబీ సినిమాస్ ఇక్కడ మంచి సక్సెస్ కావడంతో బెంగళూరులో కూడా ఏఎంబీ సినిమాస్ని నిర్మిస్తున్నారు.బెంగళూరు గాంధీనగర్ లో ఉన్న కపాలి థియేటర్ కర్ణాటకలోనే అతిపెద్ద థియేటర్ కాగా,దాదాపు 40 ఏళ్లుగా ఈ థియేటర్ సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.
ఇప్పుడు ఆ థియేటర్కి భారీ నష్టాలు వస్తుండడంతో 2017లో క్లోజ్ అయింది. ఇక ఇప్పుడు ఆ స్థలంలో పెద్ద మాల్ కడుతుండడంతో మహేష్ బాబు తన AMB సినిమాస్ ని కట్టే ఆలోచన చేశారు. నిన్న ఈ థియేటర్కి పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.ఈ పూజా కార్యక్రమంలో ఏషియన్ సునీల్ తన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ మల్టీప్లెక్స్ లో 6 స్క్రీన్స్ ఉంటాయని,హైదరాబాద్లో మాదిరిగానే బెంగళూరులోను అద్భుతంగా నిర్మించనున్నారని సమాచారం. సినిమాలలోనే కాదు బిజినెస్లలో కూడా రాణిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు బెంగళూరులోను మంచి సక్సెస్ సాధిస్తాడని చెబుతున్నారు. అతనికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే చివరిగా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్తో ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు రెండేళ్లపాటు కాల్షీట్స్ ఇచ్చాడని టాక్. ఇక ఈ మూవీలో మహేష్ బాబు లుక్ డిఫరెంట్గా ఉంటుందని, గతంలో ఎప్పుడు చూపించని విధంగా మహేష్ని రాజమౌళి చూపించబోతున్నాడని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు
జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.