Manchu Vishnu| బెంగళూరు రేవ్ పార్టీ ఇంకా టాలీవుడ్లో ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. మే 19 ఆదివారం రాత్రి బెంగుళూరులోని ఓ ఫార్మ్ హౌస్లో జరిగిన ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులకి సమాచారం అందడంతో వారు రైడ్ చేసి దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో టా
Manchu Vishnu| బెంగళూరు రేవ్ పార్టీ ఇంకా టాలీవుడ్లో ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. మే 19 ఆదివారం రాత్రి బెంగుళూరులోని ఓ ఫార్మ్ హౌస్లో జరిగిన ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులకి సమాచారం అందడంతో వారు రైడ్ చేసి దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో టాలీవుడ్ నటులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారని జోరుగా ప్రచారాలు సాగగా, హేమ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే తాను పార్టీకి వెళ్లలేదని హైదరాబాద్లోనే ఉన్నట్టు వీడియో రిలీజ్ చేసింది.హైదరాబాద్ లో గల ఓ ఫార్మ్ హౌస్ లో నేను చిల్ అవుతున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. పుకార్లను నమ్మవద్దు అంటూ వీడియోలో తెలిపింది.
అయితే బెంగుళూరు పోలీసులు పార్టీలో పాల్గొన్న టైమ్లో నటి హేమ ఫోటోని విడుదల చేశారు. ఫోటోలో వేసుకున్న డ్రెస్ లోనే హేమ వీడియో బైట్ రిలీజ్ చేయడంతో అందరు షాక్ అయ్యారు. ఇక హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నాయని. వైద్య పరీక్షలో పాజిటివ్ అని తేలినట్టు ప్రచారాలు కూడా సాగాయి. అయితే హేమపై గత కొద్ది రోజులుగా తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడుతున్న నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. నిర్ధారణ కాని సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని మంచు విష్ణు అన్నారు. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే ఆమె పరిగిణించబడుతుందని తెలిపారు.
హేమ కూడా ఒక తల్లి, భార్య అని మనం మరచిపోవద్దు. రూమర్స్ వలన హేమ ఇమేజ్ని తప్పుబట్టడం చాలా అన్యాయం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది. హేమకు సంబంధించిన కచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు మాకు అందజేస్తే తగిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మంచు విష్ణు అన్నారు. అయితే అప్పటి వరకు దయచేసి నిరాధారమైన వార్తలను సంచలనం చేయకుండా ఉండాలంటూ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కోరారు విష్ణు.