జబర్ధస్త్ షోతో అనేక మంది కమెడీయన్స్ వెలుగులోకి వచ్చారు. వారిలో లేడి కమెడీయన్ ఫైమా కూడా ఒకరు. తనదైన పంచ్లతో, డైలాగ్స్తో కడుపుబ్బ నవిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో పడి కొన్నాళ్లపాటు అతనితో పీకల్లోతు ప్రేమలో ఉంది. కాని ఇటీవల వారు విడిపోయినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వారిద్దరు శ్రీదేవి డ్రామా కంపెనీలో తిరిగి కనిపించి సందడి చేశారు. ఫైమా, ప్రవీణ్లు తాము ప్రేమించుకున్నామని, ఒకరికొకరం చాలా ఇష్టమని బహిరంగంగానే చెప్పారు. కానీ ఈ మధ్య ఈ ఇద్దరు మధ్య గ్యాప్ వచ్చింది. ఆ మధ్య ప్రవీణ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే బిగ్ బాస్ తర్వాత ఈటీవికి దూరంగా ఉన్న ఫైమా రీసెంట్గా ప్రవీణ్తో కలిసి `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో సందడి చేశారు. రష్మి యాంకర్గా ఉన్న ఈ షోకి వీరిద్దరు రావడంతో అసలు వీరి వ్యవహారం ఏంటో తేల్చాలని హైపర్ ఆది, రష్మి, ఇంద్రజలు డిసైడ్ అయ్యారు. ఏం జరిగిందో చెప్పాలని అడిగారు. ముందుగా దీనిపై స్పందించిన ప్రవీణ్.. తాను ఫైమాకి నచ్చలేదని తెలిపారు. ఆమెనే తనతో నువ్వు నచ్చలేదని చెప్పినట్టు స్పష్టం చేశాడు. అయితే వారిద్దరిని కలిసి పట్టుకోమని చెప్పగా ఫైమా కొంత ఇబ్బందిగా కనిపించింది. ప్రవీణ్తో మాట్లాడేందుకు కూడా అంత ఆసక్తిగా కనిపించలేదు.
ఏం జరగలేదు, ఇద్దరం మాట్లాడుకుంటున్నామని ఏదో చూచాయిగా చెప్పుకొచ్చింది. ఇది గమనించిన యాంకర్ రష్మి.. అసలు విషయాన్ని చెప్పింది. బాగానే ఉంటున్నావని చెబుతున్నావ్, కానీ అతన్ని పట్టుకునేందుకే ఇబ్బంది పడుతున్నావంటూ రష్మీ అనగా, దానికి ఫైమా సమాధానం ఇవ్వలేకపోయింది. ఇది చూసిన వారు ఇద్దరి మధ్య ఏదో బలమైన కారణం ఉందని అంటున్నారు. వారిద్దరి మధ్య ఏదో జరిగిందని, అందుకే క్లోజ్గా మూవ్ కాలేకపోతున్నారని అంటున్నారు. మరి అసలు ఏం జరిగిందనేది రానున్న రోజులలో అయిన చెబుతారా అనేది తెలియాల్సి ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రారంభమై మూడేళ్లు అయిన సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేయగా, ఇందులో ఫైమా, ప్రవీణ్ కలిసి కనిపించి సందడి చేశారు. వచ్చే వారం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.