Rashmika Mandanna | రష్మిక మందన్న వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నది. చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజుల్లోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది. అందం, అభినయంతో అభిమానుల్లో ప్రత్యేకంగా గుర్తింపును సొంతం చేసుకున్నది. ప్రస్తుతం దక్షిణ చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యురేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో రష్మిక సైతం చేరింది. చివరగా యానిమల్ మూవీతి ప్రేక్షకుల ముందుకు రాగా.. త్వరలో పుష్ప-2తో అభిమానుల ముందుకురానున్నది. ఇదిలా ఉండగా.. రష్మి ఆస్తుల గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రష్మిక 1996, ఏప్రిల్ 5న సుమన్-మదన్ మందన్నాలకు జన్మించింది.
ఆమె స్వస్థలం కర్ణాటక కొడగు జిల్లా. 2016లో వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ కన్నడ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కన్నడంలోనే రెండు చిత్రాల్లోనూ నటించింది. 2018లో తెలుగులో ‘చలో’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘గీతా గోవిందం’ చిత్రం రష్మిక కెరీర్నే మలుపుతప్పింది. ఇక ప్రస్తుతం రష్మిక ఆస్తులు రూ.50కోట్లకుపైగా ఉందని టాక్. ప్రతినెలా రూ.60లక్షల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఏడాదికి రూ.8.5కోట్ల వరకు ఆర్జిస్తున్నట్లు తెలుస్తున్నది. దక్షిణ చిత్ర పరిశ్రమలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్-10 హీరోయిన్లలో రష్మిక సైతం ఉన్నది.
ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.5కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. యానిమల్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ విజయాన్ని అందుకున్నది. అదే సమయంలో త్వరలో పాన్ ఇండియా చిత్రం పుష్ప-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈచిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రష్మిక బర్త్డే సందర్భంగా రష్మిక ‘శ్రీవల్లి’ పాత్ర లుక్ను విడుదల చేయగా అభిమానుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత రష్మిక రెమ్యునరేషన్ను భారీగా పెంచే అవకాశం కనిపిస్తున్నది. ఇక ప్రస్తుతం రష్మిక హైదరాబాద్, ముంబయి, గోవా, కుర్గ్ ప్రాంతాల్లో సొంత ఇండ్లు ఉన్నట్లు సమాచారం. ఇక రష్మిక పుష్ప-2తో పాటు రెయిన్బో, ది గర్ల్ఫ్రెండ్, హిందీలో చావా చిత్రంలో నటిస్తున్నది.