Rajamouli| ఈ రోజు పోలింగ్ డే కావడంతో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా వారు ఓటు వేసే ప్రాంతానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజమౌళి అయితే ఏకంగా
Rajamouli| ఈ రోజు పోలింగ్ డే కావడంతో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా వారు ఓటు వేసే ప్రాంతానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజమౌళి అయితే ఏకంగా దుబాయ్ నుండి హైదరాబాద్కి వచ్చి ఎయిర్ పోర్ట్ నుండి డైరెక్ట్గా పోలింగ్ బూత్కి వెళ్లి ఓటు వేశారు. రాజమౌళి, భార్య రమా రాజమౌళి, తనయుడు కార్తికేయ దుబాయ్ నుంచి వచ్చి మరీ ఓట్ వేసినట్టు చెప్పుకొచ్చాడు. దుబాయ్ నుండి వచ్చి మేము ఓటు వేశాము, మీరంతా కూడా ఓటు వేయండి అని కార్తికేయ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. రాజమౌళి అండ్ ఫ్యామిలీ చేసిన పని ఎంతో మందికి ఇన్స్పైర్ అవుతుందని చెప్పొచ్చు. సిరాతో ఆయన దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
మహేష్ కూడా కొద్ది రోజులుగా దుబాయ్ లో ఉన్నట్టు తెలుస్తుండగా, ఆయన దుబాయ్ నుంచి వచ్చాడా, మహేష్ ఓటు వేయడానికి వస్తాడా లేదా అని ముచ్చటించుకుంటున్నారు. ఇక రాజమౌళి, మహేష్ బాబు ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే `SSMB29` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. గ్లోబల్ మార్కెట్కి రీచ్ అయ్యేలా, ఇండియన్ ఆడియెన్స్ లోనూ కొత్త ఆడియెన్స్ ని థియేటర్ కి తీసుకు వచ్చేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. చిత్రంలో సాహసికుడిగా మహేష్ బాబు కనిపించనున్నారట. లోకేషణ్ అన్వేషణ కోసమే రాజమౌళి దుబాయ్ వెళ్లారని తెలుస్తుంది. ఇక మహేష్ ఈ సినిమా కోసం సరికొత్త లుక్లో మారేందుకు కృషి చేస్తున్నారు.