Anasuya Bharadwaj | యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూరీడరింగ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చకున్నది. ముఖ్యంగా జబర్దస్ కామెడీ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నది. ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. రంగస్థలం, క్షణం, యాత్ర, పుష్ప, విమానం తదితర చిత్రాల్లో కీలపాత్రలు పోషించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నది. ఇతర భాషల్లోనూ అవకాశాలు రావడంతో ప్రస్తుతం బుల్లి తెరకు గుడ్బై చెప్పింది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ వస్తుంది. ఏదో విషయంలో వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటుంది. అలాగే, హాట్ఫొటో షూట్లతో నెటిజన్లను ఊపిరాడకుండా చేస్తుంది. తనపై విమర్శలు చేసే వారికి గట్టిగానే ఇచ్చిపడేస్తుంది.
తాజాగా న్యూస్ వైరల్గా మారింది. ఓ స్టార్ డైరెక్టర్ అనసూయను టార్చర్ చేస్తున్నాడనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆ దర్శకుడు అనసూయపైనే దృష్టి పెట్టాడని.. తన కోరిక తీరిస్తే అదిరిపోయే క్యారెక్టర్ ఇస్తానంటూ ఇబ్బంది పెడుతున్నాడని ప్రచారం జరుగుతున్నది. అయితే, అనసూయ ఆ డైరెక్టర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని.. అయినా ఆ డైరెక్టర్ వెంటపడుతున్నాడని.. లేకపోతే కెరీర్ను నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఆ డైరెక్టర్ ఎవరై ఉంటారని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా అనసూయ భరద్వాజ్ ఇటీవల ‘రజాకార్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం తమిళచిత్రం ఫ్లాష్ బ్యాక్, పుష్ప-2 ది రూల్ చిత్రాల్లో నటిస్తున్నది.