Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం బిగ్ స్క్రీన్పై దూసుకుపోతున్నది. 2012లో ‘ముజ్సే కుచ్ కెహ్తీ.. యే ఖామోషియాన్’ సీనియర్లో నటించింది. 2014లో మరాఠి చిత్రం ‘విట్టిదండు’లో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం హిట్కావడంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, పలు సినిమాల్లో నటించిన పెద్దగా పేరు తీసుకురాలేదు. 2022లో హను రాఘవపుడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘సీతారామం’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. చిత్రం యావత్ సినీ ప్రేమికులను కట్టిపడేసింది. బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇందులో సీత పాత్ర మృణాల్కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో మృణాల్ కెరీర్నే మలుపుతిప్పింది. ప్రస్తుతం తెలుగులో నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ విడుదలైంది. అభిమానుల పాజిటివ్ టాక్ వస్తున్నది. అయితే, సినిమా ప్రమోషన్లో పాల్గొన్న మృణాల్ ఓ ఇంటర్వ్యూలో ఆస్తకికర వ్యాఖ్యలు చేసింది.
తనకు భాష రాని ప్రదేశంలో ఉండడం కష్టంగా ఉంటుందని చెప్పింది. సీతారామం సినిమా చేస్తున్న సమయంలో తెలుగు రాక ఇబ్బందిపడ్డానని.. ఆ సమయంలో హిందీ, మరాఠి భాషలు మాత్రమే వచ్చని చెప్పింది. తెలుగు నేర్చుకోవడం కష్టంగా అనిపించేదని.. నేర్చుకుందామని ప్రయత్నం చేసినా తెలుగు రాలేదని.. సీతారామం షూటింగ్ సమయంలో తెలుగు రాక ఏడ్చేసిసనట్లు తెలిపింది. ఆ సమయంలోనే సీతారామం తర్వాత మళ్లీ సినిమాలు చేయకూడదని ఫిక్సయ్యాయని చెప్పింది. మూవీ షూటింగ్ కశ్మీర్లో జరుగుతున్న సమయంలో హీరో దుల్కర్ సల్మాన్కు ఇదే నా తొలి, ఆఖరి తెలుగు సినిమా అని చెప్పేశానని.. ఇకపై మళ్లీ తెలుగులో నటించనని చెప్పానని చెప్పుకొచ్చింది. తనకు దుల్కర్ ఎంతో ధైర్యం చెప్పారని తెలిపింది. ప్రస్తుతం తమిళం, కన్నడలోనూ సినిమాలు చేద్దామనుకుంటున్నానని.. అది దుల్కర్ వల్లేనని పేర్కొంది. ప్రస్తుతం మృణాల్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా.. మృణాల్ నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరో. ప్రస్తుతం మృణాల్ హిందీలో ‘పూజా మేరిజాన్’ చిత్రంలో నటిస్తున్నది