రూ. 2,000 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

విధాత,ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 2,000 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి అక్రమంగా రవాణా చేస్తున్న 293.81 కిలోల సరుకును నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఓడరేవు నుంచి రహదారి ద్వారా పంజాబ్‌కు రవాణా చేయాల్సి ఉంది, ఈ క్రమంలో అక్కడ అధికారులు దీనిని అడ్డుకుని ఆరు గన్నీ సంచుల్లో ఉన్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ ప్రకారం.. జప్తు […]

రూ. 2,000 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

విధాత,ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 2,000 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి అక్రమంగా రవాణా చేస్తున్న 293.81 కిలోల సరుకును నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఓడరేవు నుంచి రహదారి ద్వారా పంజాబ్‌కు రవాణా చేయాల్సి ఉంది, ఈ క్రమంలో అక్కడ అధికారులు దీనిని అడ్డుకుని ఆరు గన్నీ సంచుల్లో ఉన్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ ప్రకారం.. జప్తు చేసిన హెరాయిన్‌ను టాల్కమ్‌ రాళ్లతో రెండు కంటైనర్లలో దాచినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పంజాబ్‌లోని తరన్ టార్న్ ప్రాంతానికి చెందిన ప్రభుజిత్ సింగ్ అనే సరఫరాదారుని మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.