విధాత : అవినీతి అధికారుల భరత పట్టడంలో తెలంగాణ ఏసీబీ దూసుకుపోతుంది. సోమవారం మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. మేడ్చల్ కలెక్టరేట్లో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన దాడుల్లో రూ. 45వేలు లంచం తీసుకుంటూ ఇండస్ట్రియల్ ఏడీ వెంకట నర్సిరెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. పరిశ్రమ అనుమతి కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అటు సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా సబ్ రిజిస్ట్రర్ సురేందర్ నాయక్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఏజెంట్ నుంచి రూ.99,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రర్తో పాటు ఏజెంట్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు. తనిఖీల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఏసీబీకి చిక్కిన మరో ఇద్దరు అధికారులు మేడ్చల్లో ఇండిస్ట్రియల్ అధికారి ..సూర్యాపేటలో రిజిస్ట్రార్
వినీతి అధికారుల భరత పట్టడంలో తెలంగాణ ఏసీబీ దూసుకుపోతుంది. సోమవారం మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు

Latest News
డీలిమిటేషన్ బిల్లుతో ఉత్తరాదికి ఆధిపత్యం... దేశంలో చీలిక : మేధావుల ఆందోళన
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వీ వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్ ఫైర్
రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దంగా ఉంది : మాజీ మంత్రి మోత్కుపల్లి
కొత్త పార్టీ సన్నాహాలు...కాశీలో కవిత పూజలు
దేశ చరిత్రలో మహిళ రిజర్వేషన్ బిల్లు కీలక ఘట్టం: ప్రధాని మోదీ
ఉద్యోగుల డిమాండ్లపై 17న తహశీల్దార్లకు వినతులు: లచ్చిరెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం మూర్ఖత్వం: ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్
సింగర్ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్
పీవీఆర్ మాల్ నిర్లక్ష్యం..ఉద్యోగి ప్రాణం బలి !
దారుణం.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని