విధాత : అవినీతి అధికారుల భరత పట్టడంలో తెలంగాణ ఏసీబీ దూసుకుపోతుంది. సోమవారం మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. మేడ్చల్ కలెక్టరేట్లో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన దాడుల్లో రూ. 45వేలు లంచం తీసుకుంటూ ఇండస్ట్రియల్ ఏడీ వెంకట నర్సిరెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. పరిశ్రమ అనుమతి కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అటు సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా సబ్ రిజిస్ట్రర్ సురేందర్ నాయక్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఏజెంట్ నుంచి రూ.99,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రర్తో పాటు ఏజెంట్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు. తనిఖీల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఏసీబీకి చిక్కిన మరో ఇద్దరు అధికారులు మేడ్చల్లో ఇండిస్ట్రియల్ అధికారి ..సూర్యాపేటలో రిజిస్ట్రార్
వినీతి అధికారుల భరత పట్టడంలో తెలంగాణ ఏసీబీ దూసుకుపోతుంది. సోమవారం మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు

Latest News
‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయంపై మెగాస్టార్ భావోద్వేగ స్పందన
చిలకపచ్చ చీరలో కేక పెట్టిస్తున్న మాళవిక మోహనన్
చీరకట్టులో హీట్ పెంచిన నిధి అగర్వాల్
ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం
ఇది బ్లాక్బస్టర్ కాదు… ‘బాస్బస్టర్’! – అల్లు అర్జున్
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది : ఈనెల 24న లేదా 27న
రాత్రి బెడ్లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?
రియల్ మీ బాహుబలి బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఫిక్స్ !