మణిపూర్లో మళ్లీ హింస.. రెండు ఇండ్లకు నిప్పు

- ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో రెండు ఇండ్లకు నిప్పు
- రాత్రివేళ కాల్పులకు తెగబడ్డ దుండగులు
- ఇప్పటివరకు అల్లర్లలో 175 మంది మృతి
విధాత: మణిపూర్లో హింసాకాండ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా మరోసారి హింస చోటుచేసుకున్నది. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో బుధవారం రాత్రి దుండగులు రెండు ఇండ్లు నిప్పు పెట్టారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పట్సోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ కెయిథెల్మన్బిలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని దుండగులు అనేక రౌండ్ల బుల్లెట్లు కాల్చారు. రెండు ఇండ్లకు నిప్పు పెట్టారు. అనంతరం అక్కడి నుంచి వారంతా పరారయ్యారు. భద్రతా బలగాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
అనంతరం మెయితీ వర్గం మహిళల గుంపు ఆ ప్రాంతంలో గుమిగూడిందని, భద్రతా దళాలు మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయని పోలీసులు తెలిపారు. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నదని పేర్కొన్నారు.
మణిపూర్లో మే 3న రెండు జాతుల మధ్య చెలరేగిన హింస రావణకాష్టంలా మండుతూనే ఉన్నది. అప్పటి నుంచి రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లలో 175 మంది మరణించారు. 50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వందలాది ఇండ్లు కాలిపోయాయి, వ్యాపారాలు నష్టపోయాయి, చదువులు దెబ్బతిన్నాయి, ప్రార్థనా స్థలాలు అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్రంలో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 4,500 ఆయుధాలు, 650,000 రౌండ్ల మందుగుండు సామాగ్రి మాయమైనట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. మణిపూర్ పోలీసులు, భద్రతా దళాలు ఇప్పటివరకు 1,500 ఆయుధాలు, సుమారు 15,000 మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
మణిపూర్లోని కుకీ గ్రూపులు రాష్ట్ర పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మరియు రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి అస్సాం రైఫిల్స్ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అస్సాం రైఫిల్స్ కేంద్ర ప్రభుత్వానికి మరియు మణిపూర్ పోలీసులకు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, మైతీకి నివేదించింది.