Lakshmi Puja | హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజున లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తమ కోరికలు కోరుకుంటారు. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మరి శుక్రవారమే లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు..? పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
Lakshmi Puja | హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజున లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తమ కోరికలు కోరుకుంటారు. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మరి శుక్రవారమే లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు..? పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
రాక్షసులందరికీ శుక్రాచార్యుడు అనే గురువు ఉండేవాడట.. ఆ రాక్షసుల గురువు అయినా శుక్రాచార్యుడి పేరు మీదుగానే ఈ శుక్రవారం అనే పేరు కూడా వచ్చిందని పండితులు చెబుతున్నారు. కాగా శుక్రాచార్యుడి తండ్రి మరెవరో కాదు భృగు మహర్షి. భృగుమహర్షిని బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరిగా చెబుతుంటారు. ఆ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడు. అందుకే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ప్రీతికరం అని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున అందరు అలా పూజలు మొదలు పెట్టారని చెబుతున్నారు.
అలా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైంది. ప్రీతికరమైన శుక్రవారం రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవ్వడంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఆవు పాలు, తాజా పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం, బంగారం, వెండి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెబుతారు. అందుకే ఈ వస్తువులను పొరపాటున కూడా నేల మీద పెట్టరాదు. కాలితో తన్నరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.
ఎవరైతే నిస్సహాయులకు చేయూత నిచ్చి ఆదుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మూగజీవాల పట్ల జాలి, దయ చూపించే వారికి ఎప్పుడు ధనానికి లోటుండదు. ఎవరైతే తనకున్నంతలో దానధర్మాలు చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహానికి లోటుండదు. ధర్మబద్ధంగా తాను సంపాదించిన దానిలో కొంత దానం చేయడానికి ఉపయోగించాలి. దైవ కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండే వారికి దానం చేసిన దానికి పదిరెట్లు కలిసివస్తుంది.
ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేవారు శుక్రవారం రోజున ధూమపానం మద్యపానం అలాగే మాంసాహారం వంటివి తీసుకోకూడదు. అలాగే తెలిసి, తెలియక కొన్ని పొరపాట్లు అసలు చెయ్యకూడదు.. అలా చేస్తే అమ్మకు కోపం వస్తుంది.