ఆ మహా శివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. కాబట్టి శివుడి భక్తులందరూ సోమవారం నాడు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. వీలుకాని వారు ఇంట్లోనే ఉండి ఆ నీలకంఠుడిని పూజిస్తుంటారు. అయితే సోమవారం పొద్దున్నే శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట. అంతేకాకుండా ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే.. డబ్బుకు లోటు ఉండదట.
ఆ మహా శివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. కాబట్టి శివుడి భక్తులందరూ సోమవారం నాడు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. వీలుకాని వారు ఇంట్లోనే ఉండి ఆ నీలకంఠుడిని పూజిస్తుంటారు. అయితే సోమవారం పొద్దున్నే శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట. అంతేకాకుండా ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే.. డబ్బుకు లోటు ఉండదట. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
మీ కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం రోజు మహాశివుడిని పూజించి 108 సార్లు ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని పటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం, సంతోషం ఎప్పుడూ ఉంటాయి.. మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఉండాలంటే సోమవారం రోజు 1.25 కిలోల బియ్యాన్ని తీసుకోవాలి. అందులో కొంత శివుని దేవాలయంలో సమర్పించాలి.మిగిలిన బియ్యాన్ని ఎవరికైనా దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఇంకా చెప్పాలంటే ఏదైనా పనిలో విజయం సాధించాలంటే మీ ఇంట్లో కొమ్ములు లేని జింక చిత్రాన్ని పెట్టుకోవాలి.
ఆ ఫోటోను మీ ఇంట్లో పెట్టడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఓం అనే శబ్దాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ కెరియర్ లో పురోగతిని సాధిస్తారు. అలాగే మీరు ఏ పని చేసినా ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీరు ఎంత సంపాదించినా ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలంటే మీ ఇంటికి సమీపంలో ఏదైనా శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన నీటిలో కొన్ని చుక్కలు పాలు, గంగాజలం కలిపి శివలింగానికి సమర్పించాలి.. ఇలా చెయ్యడం వల్ల ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.