Sambrani Dhoop | సాంబ్రాణి ధూపం.. ఈ పేరు వినని వారు ఉండరు. దర్గాల వద్ద సాంబ్రాణి ధూపం సువాసన వెదజల్లుతుంటుంది. చాలా మంది తమ ఇండ్లలో కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటారు. ఈ ధూపం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విశ్వసిస్తారు. పసి పిల్లల ఆరోగ్యం నుంచి మొదలుకుంటే.. ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా, ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండేందుకు ఈ ధూపం ఉపయోగపడుతుంది. ఆ ఇళ్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతోంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అయితే వారంలో ఒక్కోరోజు సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఒక్కో ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
ఆదివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం కారణంగా ఆత్మబలం పెరుగుతుందట. దీంతో పాటు సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని నమ్మకం. ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
సోమవారం రోజున ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. అలాగే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చంటున్నారు.
మంగళవారం నాడు సాంబ్రాణి ధూపం వేయడం వల్ల శత్రుభయం, ఈర్ష్య, అసూయ వంటి వాటిని దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. అప్పులతో బాధపడేవారు ఈ రోజున గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల తొందరగా అప్పులు తీరుతాయట. కుమారస్వామి అనుగ్రహం కూడా లభిస్తుందట.
ఈ రోజున సాంబ్రాణి ధూపం వేస్తే నమ్మకద్రోహం, అలాగే ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారని చెబుతున్నారు.
గురువారం రోజున సాంబ్రాణి పొగ వేయడం కారణంగా.. ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి.
లక్ష్మీ కటాక్షం పొందడానికి ఈ రోజున సాంబ్రాణి ధూపం వేయాలని.. శుక్రవారం రోజున ఇలా చేయడం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు.
కొంత మంది ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటారు. అయితే, కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలా బద్ధకంగా ఉంటే.. శనివారం రోజున సాంబ్రాణి వేయాలని వాస్తు పండితులు చెబుతున్నారు.