విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళశారం రెండో రోజు స్వామి వారి ఆలయంలో నిత్యారాధనలు, స్వామిఅమ్మవార్లకు లక్ష పుష్పార్చన అనంతరం జయంతి ఉత్సవాల్లో భాగంగా నారసింహుడిని కాళీయ మర్ధనుడి అవతారంలో అలంకరించి తిరువీధుల్లో విహరింపచేశారు. సాయంత్రం హనుమంత్ వాహన సేవలో శ్రీరామావతారంలో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనందంతో పులకించారు. ఒకవైపు వేసవి సెలవుల నేపథ్యంలో పెరిగిన భక్తుల రద్దీ..మరోవైపు నృసింహ జయంతి ఉత్సవాలతో ఆలయం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ఈవో భాస్కర్రావు, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మినరసింహాచార్యులు, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.
Yadadri | కాళీయ మర్ధనుడిగా.. శ్రీరాముడిగా నారసింహుడు.. ఘనంగా జయంతి ఉత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగుతున్నాయి

Latest News
తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విలువ భారీగా పెంపు!
మినీ కూపర్ స్పెషల్ ఇన్స్పైర్డ్ ఎడిషన్.. కేవలం 30 కార్లు మాత్రమే.. వీటి ధర ఎంతంటే..!
నిప్పులు కురవడమంటే ఇదే.. ఈరోజు 46.5 డిగ్రీల ఎండతో మాడిపోయిన తెలంగాణ
7560mAh భారీ బ్యాటరీ.. 100W ఫాస్ట్ చార్జింగ్తో రెడ్మీ కొత్త స్మార్ట్ఫోన్.. ధర ఎంతంటే..!
కోమాలో నుంచి బయటకొచ్చి ముగ్గురు పిల్లల గురించి ఆరా తీసిన టీనేజర్.. షాక్లో పేరెంట్స్!
శోభనం రాత్రి భార్యను మేకప్ లేకుండా చూసి కంగుతిన్న కొత్త పెళ్లి కొడుకు..!
సిద్ధమవుతున్న హైస్పీడ్ కారిడార్లు.. ఆ నగరాల మధ్య మెరుగైన రవాణా సదుపాయం.. రియల్ ఎస్టేట్కు బూమ్
ఇది కదా అదృష్టమంటే.. పాత ప్యాంటులో దొరికిన లాటరీ టికెట్కు కోట్ల రూపాయల జాక్పాట్!
మే 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు.. కాళేశ్వరం వద్ద ఏర్పాట్లు పూర్తి
ప్రైవేట్ ఆసుపత్రులపై సుప్రీంకోర్టు ఆగ్రహం